కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం మధ్యాహ్నం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో అక్టోబర్ 21, 2021 నాటికీ 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ మైలురాయిని సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరింత వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా మొదటి డోస్ కవరేజీ, రెండో డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై కూడా కేంద్రమంత్రి సూచనలు చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఏడాది చివరినాటికి అర్హులైన జనాభా అందరికి వ్యాక్సిన్ వేసే లక్ష్యాన్ని చేరుకోవడం, వ్యాక్సినేషన్ లో వేగం పెంచడం, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ సహా పలు అంశాలపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ