కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 30, బుధవారం నాడు అన్లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులు, క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ అక్టోబర్ 15 నుండి తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చారు. సినిమా థియేటర్లను, మల్టీప్లెక్సులను సీటింగ్ సామర్థ్యంలో 50% తో ప్రారంభించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu