భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 80472 పాజిటివ్ కేసులు నమోదవగా, 1179 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 30, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 62,25,763 కు, మరణాల సంఖ్య 97,497 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతం ఉండగా, ప్రపంచంలో ఈ వైరస్ వలన మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఒకే రోజులో 86,428 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 51,87,825 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 83.3 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 9,40,441 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu