ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీల మధ్య మతాల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఎస్పీ ఎలక్షన్ సింబల్ అయిన సైకిల్ను ఎగతాళి చేశారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితులు సైకిళ్లపై బాంబులు పెట్టారని, ఎస్పీ ఎన్నికల గుర్తు కూడా సైకిలేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే, సైకిల్ గురించి ప్రధాని మోదీ ఎగతాళిగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ మండిపడ్డారు. సైకిల్ను అవమానించడం దేశాన్ని అవమానించడమేనని అఖిలేష్ పేర్కొన్నారు.
“రవాణాకు ఉపయోగించుకునే పేదల జీవితాల్లో సైకిల్ అంతర్భాగమని అన్నారు. రైతులు శ్రేయస్సు వైపు దూసుకుపోవడానికి సైకిళ్లు సహాయపడతాయి. మా సైకిల్ మా ఆడబిడ్డలను పాఠశాలకు తీసుకువెళుతుంది. సామాజిక పరిమితుల కంటే పైకి లేస్తుంది. అది ధరలతో సంబంధం లేకుండా నడవగలిగే ఏకైక ప్రయాణ మార్గం మా సైకిల్. ఇంకా మన సైకిల్ సామాన్యులకు ఒక విమానం వంటిది. సైకిల్ గ్రామీణ భారతదేశానికి గర్వకారణం. అలాంటి మన సైకిల్ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే.” అని అఖిలేష్ యాదవ్ నిర్వచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ