‘బంగారు తెలంగాణ’ ఎలా తయారు చేసుకున్నామో .. అలాగే ‘బంగారు భారతదేశం’ కూడా తయారు చేసుకుందాం అని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు నారాయణఖేడ్లో సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అనేక రంగాలలో రాష్ట్రం ముందడుగు వేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్” అని సీఎం కేసీఆర్ అన్నారు.
“అలాగే సాగునీటికి, త్రాగునీటికి లోటు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఇక సంక్షేమపథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నట్లు దేశంలో ఇంకెక్కడా అమలవ్వట్లేదు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చూపిన స్ఫూర్తిని ముందు ముందు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తానని తెలిపారు. ‘బంగారు తెలంగాణ’ను ఎలా తయారు చేసుకున్నామో అదే విధంగా ‘బంగారు భారతదేశం’ కూడా తయారు చేసుకుందాం” అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ