దేశంలో ఉల్లిపాయల ధరలు అమాంతం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్ లలో ఉల్లిపాయల సరఫరా పెంచి, ధరల తగ్గింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు డిసెంబర్ 15 వ తేదీ వరకు ఉల్లి దిగుమతులపై ఉన్న నిబంధనలను స్వల్పంగా సడలిస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల శాఖ బుధవారం నాడు వెల్లడించింది. అలాగే మార్కెట్ లో ఉల్లి ధర పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, నిల్వ కేంద్రాల్లో ఉన్న ఉల్లిని బహిరంగ మార్కెట్కు తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టిన్నట్టు ప్రకటించారు. దేశంలో ఖరీఫ్ సీజన్ లో అందుబాటులోకి వచ్చిన 37 లక్షల టన్నుల ఉల్లి ఇంకా మార్కెట్ కు రావాల్సిఉందని, అనంతరం ధరలు తగ్గనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu