ముస్లిం సోదరీమణులు బీజేపీ పాలనలో సురక్షితంగా ఉన్నారు – కాన్పూర్ ర్యాలీలో ప్రధాని మోదీ

2022 Up Assembly Elections, Mango News, Muslim Women Feel Safe Under BJP Rule PM, PM Modi Says in Kanpur, UP assembly election 2022, UP Assembly Elections, Up Assembly Polls, UP Elections, UP Elections 2022, UP Elections 2022 Latest Update, UP Elections 2022 Muslim Women Feel Safe Under BJP Rule, UP Elections 2022 Muslim Women Feel Safe Under BJP Rule PM Modi Says in Kanpur, UP Polls

ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం సోదరీమణులు బీజేపీ పాలనలో సురక్షితంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కాన్పూర్ నగరంలో ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీలో తిరిగి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ప్రతి కులం, ప్రతి వర్గం ప్రజలు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం ఓటు వేస్తున్నారని ఆయన  అన్నారు. డబుల్ ఇంజిన్ (మోదీ, యోగి) ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి నడిపిస్తోంది రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ప్రధాని మోదీ తెలిపారు.

‘ముస్లిం మహిళలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి బిజెపికి మద్దతు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి పాలనలో ముస్లిం బాలికలు సురక్షితంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు చాలా మంది ముస్లిం బాలికలు పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్తున్నారు. ముస్లిం మహిళల జీవితాలను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఆహారధాన్యాలు సైతం అందలేదని విమర్శించారు. లక్షలాది నకిలీ రేషన్ కార్డులను సృష్టించి రేషన్ కుంభకోణాలు చేశాయని మండిపడ్డారు. అయితే, సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు కోట్లాది మంది ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఉచితంగా రేషన్ సరుకులను పొందుతున్నారని ప్రధాని మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − two =