రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రెండు రోజుల పాటుగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముందుగా ఫిబ్రవరి 20న మధ్యాహ్ననానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకోనున్నారు. అనంతరం నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుని ప్రెసిడెన్షియల్ సూట్ కి వెళ్లి, ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఫిబ్రవరి 21, సోమవారం ఉదయం నేవల్ డాక్యార్డుకు చేరుకుని ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం పీఎఫ్ఆర్ గ్రూప్ ఫొటో కార్యక్రమంలో, విందు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఇక ఫిబ్రవరి 22 ఉదయం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు, ఇతర సంబంధిత అంశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ