ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్సైల సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు మరణానికి కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఈ రోజు పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పోలీసులపై కాల్పుల ఘటన అనంతరం పరారీలో ఉన్న వికాస్ దూబే ను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో జూలై 9, గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో వికాస్ దూబే ని కాన్పూర్కు తరలిస్తుండగా ఎస్కార్ట్లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఆ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 60 కి పైగా కేసుల్లో వికాస్ దూబే కీలక నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వికాస్ దూబే ప్రధాన అనుచరులైన అమర్ దూబే, ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా, కార్తికేయ, ప్రవీణ్ వేర్వేరు ఎన్కౌంటర్లలో మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu