దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు లాక్డౌన్ అమలుచేయడంతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి, సంబంధిత చర్యలపై తెలుగు రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినట్టు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులందరితో ఫోన్ ద్వారా మాట్లాడాను. సభ్యులంతా స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేస్తున్నామని, దానితో పాటు తాము కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నామని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. తమ తమ ప్రాంతాల్లో పరిస్థితి త్వరగా మెరుగు పడుతోందని చెప్పడం కూడా ఆనందం కలిగించిందని” ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu