ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్

Andhra to construct new lift irrigation scheme, CM KCR, CM KCR On Irrigation Project on Krishna River, Irrigation Project, Irrigation Project on Krishna River, kcr latest news, KCR vows to stop Andhra from building new irrigation project, Krishna River, Telangana CM KCR, Telangana CM KCR Opposes AP Govt Plan, telangana government

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 11, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు.

‘‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహ హస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టిఎంసిల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉంది. మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలి. కాబట్టి గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టిఎంసిలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే రోజుకు రెండు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షపై సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్.కె. జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్సి మురళీధర్, ఎజి బి.ఎస్. ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డి శ్రీధర్ రావు దేశ్ పాండే, నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Etela Rajender Superb Answer To Reporter Over Traffic Jams In Hyderabad | #Covid19 | Mango News
07:31
Video thumbnail
Minister Etela Rajender About New Green Zone Districts In Telangana | #CoronaVirus | Mango News
07:38
Video thumbnail
Minister Etela Rajender Says Corona Positive Woman Safely Delivers Baby | #Covid19 | Mango News
05:58
Video thumbnail
CM KCR Serious Comments On Opposition Parties | #CoronaOutbreak | #TelanganaLockdown | Mango News
07:33
Video thumbnail
CM KCR Asks Apologies To Muslims For Facing Problems In Ramadan Month | #CoronaVirus | Mango News
10:12
Video thumbnail
CM KCR About Providing Salaries For Govt Employees | #LockdownUpdates | Telangana News | Mango News
11:16
Video thumbnail
CM KCR Face To Face Challenge For Congress Leaders In Press Meet | TRS Vs Congress | Mango News
11:45
Video thumbnail
హైదరాబాద్ ప్రజలు నన్ను క్షమించాలి | CM KCR About His Apologies For Hyderabad People In Press Meet
05:06
Video thumbnail
CM KCR Says Karimnagar Stands Ideal For Control Of Corona | #Corona | #TelanganaLockdown | MangoNews
05:38
Video thumbnail
CM KCR Mentioned Corona Vaccine Will Get Ready By August | #Covid19 | #LockdownUpdates | Mango News
08:34
Video thumbnail
మే 29 వరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు | Lockdown Will Be Extended To May 29 Says CM KCR | MangoNews
09:25
Video thumbnail
CM KCR About Manufacturing Of Covid19 Medicine In Hyderabad | #KCRPressMeet | #TelanganaLockdown
06:59
Video thumbnail
Talasani Srinivas Yadav About Movie Shootings After Lockdown | #TelanganaLockdown | Mango News
11:34
Video thumbnail
MP Revanth Reddy Emotional Speech About Koheda Farmers Problems | Telangana News | Mango News
03:22
Video thumbnail
Uttam Kumar Reddy Demands 10 Lakhs Relief To Each Family In Telangana | #CoronaVirus | Mango News
05:42
Video thumbnail
Uttam Kumar Reddy Says Less Number Of Corona Tests Conducted In Telangana | #Covid19 | Mango News
05:39
Video thumbnail
Minister Etela Rajender Fires On Opposition Over Cheap Politics | #Corona | #Lockdown | Mango News
13:06
Video thumbnail
Etela Rajender Excellent Words About Daily Wage Workers In Telangana | #CoronaVirus | Mango News
06:47
Video thumbnail
Minister Etela Rajender Says To Visit King Koti Hospital For Corona Tests | #Covid19 | Mango News
06:59
Video thumbnail
CM KCR Vs MP Revanth Reddy | CM KCR Thanked Donars | MP Revanth Redddy Donates 50 Lakhs | Mango News
08:29
Video thumbnail
Etela Rajender Gives Clarity Over Lockdown Extension In Telangana | #CoronavirusOutbreak | MangoNews
06:34
Video thumbnail
Minister Etela Rajender Responds Over Accusation Made By Oppositions | #CoronaVirus | Mango News
09:24

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 7 =