టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులు వారి అభిమానులకు గురువారం నాడు శుభవార్త అందించారు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నామని పేర్కొంటూ, తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీంతో పలువురు క్రీడా, సినీ ప్రముఖులు, హీరోయిన్స్, అభిమానులు పెద్ద ఎత్తున కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2013 నుంచి ప్రేమలో ఉన్న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఇరు కుటుంబాలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu