పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ)కి చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరుతున్నారు. టీఎంసీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సహా పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీలో చేరగా, తాజాగా టీఎంసీ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది కూడా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో శనివారం నాడు ఢిల్లీలో దినేశ్ త్రివేది బీజేపీ కండువా కప్పుకున్నారు.
అనంతరం దినేశ్ త్రివేది మాట్లాడుతూ, ఇది చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న బంగారు క్షణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ దేశాన్ని భద్రంగా ఉంచుతాయని ప్రతి ఒక్కవ్యక్తి నమ్ముతున్నారని అన్నారు. మరోవైపు ఇటీవల జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ప్రసంగిస్తున్న సందర్భంలోనే బెంగాల్లో హింసను అరికట్టేందుకు ఏమి చేయలేకపోతున్నట్టు పేర్కొంటూ ఎంపీ పదవికి రాజీనామా చేస్తునట్టు దినేశ్ త్రివేది ప్రకటించారు. ఇక పలువురు నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు బీజేపీ పార్టీలో చేరుతుండడంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ