సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్ ఏప్రిల్ నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఐటీ రూల్స్-2021 ప్రకారం ఏప్రిల్ నెలవారీ నివేదికను వాట్సాప్ విడుదల చేసింది. ఈ తాజా నివేదిక ప్రకారం వాట్సాప్ ఏప్రిల్లో 16 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించింది. ప్లాట్ఫామ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.
దీనిపై వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సేవల్లో దుర్వినియోగాన్ని నిరోధించడంలో పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. సంవత్సరాలుగా, మేము మా ప్లాట్ఫామ్లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులపై గణనీయంగా దృష్టి పెట్టాము. ఐటీ రూల్స్-2021 ప్రకారం.. మేము ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మా నివేదికను వెల్లడించాము. మా ప్లాట్ఫామ్పై దుర్వినియోగాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వాట్సాప్ సాధారణంగా కంపెనీ విధానాలు మరియు మార్గదర్శకాలను ఉల్లంఘించినప్పుడు ఆయా ఖాతాలను నిషేధిస్తుంది. తప్పుడు సమాచారాన్ని పంచుకోవడం, ధృవీకరించని సందేశాలను ఎక్కువమందికి ఫార్వార్డ్ చేయడం వంటివి జరిగినప్పుడు సత్వరమే చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF