కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేద ప్రజలకు ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ప్రకటించారు. అందులో భాగంగా 20 కోట్ల మంది మహిళ జన్ ధన్ ఖాతాదారులకు వచ్చే మూడు నెలల్లో నెలకు రూ.500 చొప్పున అందజేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా జన్ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. అయితే బ్యాంకుల్లో డబ్బును విత్డ్రా చేసుకోవడానికి వచ్చే ప్రజలు
సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానం అమలు చేయనుంది. జన్ధన్ ఖాతాలు కలిగిన వారు, వారు అకౌంట్ నంబర్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
బ్యాంకు అకౌంట్ ఆఖరి నంబర్ బట్టి నగదు విత్డ్రా తేదీలు:
- 0-1 నంబర్తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 3, 2020.
- 2-3 నంబర్తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 4, 2020.
- 4-5 నంబర్ తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 7, 2020.
- 6-7 నంబర్ తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 8, 2020.
- 8-9 నంబర్ తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 9, 2020.
3-4-2020 నుండి #PMJDY లబ్ధిదారులైన మహిళలందరికీ వారి అకౌంట్లో రు.500/- 3 నెలలపాటు జమచేయబడుతుంది.
Ac ఆఖరు అంకె బట్టి నగదు విత్డ్రా తేదీలు:
0 లేదా 1 👉 3 ఏప్రిల్, 2020
2 లేదా 3 👉 4 ఏప్రిల్, 2020
4 లేదా 5 👉 7 ఏప్రిల్, 2020
6 లేదా 7 👉 8 ఏప్రిల్, 2020
8 లేదా 9 👉 9 ఏప్రిల్, 2020 pic.twitter.com/BBYVBvIgbL— G Kishan Reddy (@kishanreddybjp) April 3, 2020
[subscribe]