ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 2, గురువారం రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసులు నమోదయినట్టుగా తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 161కి పెరిగింది. ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 23, గుంటూరులో 20, కడపలో 19 , ప్రకాశం జిల్లాలలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నంలో 14, తూర్పుగోదావరిలో 9, చిత్తూరులో 9, అనంతపురంలో 2, కర్నూల్ జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం రాత్రికి 154 కు చేరుకుంది.
#CovidUpdates: రాష్ట్రం లో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 161 కి పెరిగింది .@AndhraPradeshCM @MoHFW_INDIA #ApFightsCorona pic.twitter.com/qoOYm4loiM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 3, 2020
[subscribe]