సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నాడు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ జట్టు తోలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, శుభ మన్ గిల్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ముందుగా ఈ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నాడే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా తోలిరోజు ఆటను పూర్తిగా రద్దుచేసిన సంగతి తెలిసిందే.
భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్,
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ