ఉత్తరాఖండ్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా యాత్రికులంతా మధ్యప్రదేశ్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) June 5, 2022
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాదంలో మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిపై ప్రధానికి, హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను గురించి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF