రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 21వ తేదీ నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో జూన్ 21, సోమవారం నుంచి రాష్ట్రంలో బస్సు సర్వీసులను పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు సర్వీసులు నడపాలని, జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
అలాగే దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ను పునరుద్ధరించనున్నారు. శనివారం నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అన్ని కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకుని బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ