ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 19, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి, తదితర అంశాలపై కేబినెట్ చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజా కరోనా పరిస్థితులు, ప్రభావంపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ