సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “వీలునామా ఎలా రాయాలి? గొడవలువ వస్తే ఎలా?” అనే అంశం గురించి వివరించారు. సంపాదించిన స్వార్జితాలు, తరతరాలుగా వారికీ వచ్చిన ఆస్తులు వాళ్ళ తదనంతరం ఎవరికీ చెందాలి అనే దానిపై కొంతమందికి సందేహాలు ఉంటాయన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి వీలునామాలు రాయకపోయినా ఒకరి తర్వాత ఒకరు పెద్దరికంతో ఆస్తుల నిర్వహణ చేసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇