భారత యువతి హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ విశ్వసుందరి పోటీల్లో 21 సంవత్సరాల హర్నాజ్ సంధు చివరికి విజేతగా నిలిచింది. దీంతో భారత్ 3వ సారి మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నట్లు అయింది. 21 సంవత్సరాల తర్వాత భారత్ మరోసారి విశ్వసుందరి కిరీటం గెలిచిందనే వార్త అందరికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతకుముందు 1994 లో సుస్మితాసేన్ మొదటిసారిగా భారత్ తరపున ఈ కిరీటం సాధించారు. దాని తర్వాత, 2000వ సంవత్సరంలో మళ్ళీ లారాదత్తా విశ్వసుందరిగా నిలిచారు.
లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న సంవత్సరంలోనే హర్నాజ్ సంధు జన్మించటం విశేషం. ఇప్పుడు హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని భారతీయులకు గర్వకారణంగా నిలిచారు. కాగా, హర్నాజ్ సంధు పంజాబీ అమ్మాయి. మోడలింగ్, సినిమాలపై ఆసక్తితో హర్నాజ్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేశారు. కొన్ని పంజాబీ సినిమాల్లో కూడా నటించారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటారు హర్నాజ్. ఈమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ