శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో అడవి శేష్, ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ మరియు అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మేజర్’ సినిమాపై విశ్లేషణ చేశారు. 2008 ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అడివి శేష్ ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా చాలా బాగుందని పరుచూరి అన్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు శశి కిరణ్ టిక్కా ప్రతిభ సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇