ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించగా, బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించగా, శృతి హాసన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, కేథరిన్ త్రెసా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మళ్ళీ, మళ్ళీ చూడాలనిపించేలా ఉందని చెప్పారు. ఈ సినిమాలో ఒకటి నుంచి వంద దాకా ఒకటే గుర్తువస్తుందని, ఆ ఒక్కటి చిరంజీవి అని అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ డిజైన్, చిరంజీవి సహా ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు సినిమాను తీర్చిదిద్దిన విధానంతో పాటుగా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇