భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి రోజు నుంచే అనేక మలుపులతో ఆసక్తికరంగా సాగుతున్న రెండవ టెస్ట్ లో
భారత్ విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే భారత్ టెస్టుని గెలుచుకోవటం విశేషం. 140/5 తో సోమవారం నాలుగవ రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులు మాత్రమే సాధించి చివరి 5 వికెట్లను కోల్పోయింది. ఆట ప్రారంభమైన ఒక గంటలోపే న్యూజిలాండ్ 167 పరుగుల వద్ద కుప్పకూలింది. చివరిరోజు జయంత్ యాదవ్ 4 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీసాడు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ ఎజాజ్ పటేల్ భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 10 వికెట్లను నేలకూల్చి ప్రపంచ రికార్డు ని సాధించటం విశేషం. అయినా న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ వైఫల్యంతో టెస్ట్ మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కోల్పోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ