దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా మూడోరోజూ కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,01,078 కరోనా కేసులు నమోదవడంతో మే 8, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,18,92,676 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 4187 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,38,270 కి పెరిగింది. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా మరణాలు (4187) చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 37 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 81.90 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హర్యానా వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 37,23,446 (17.01%) దాటింది. కొత్తగా 3,18,609 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,79,30,960 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 81.90 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. ఇక మే 7, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 30,04,10,043 కు చేరుకుంది. గత 24 గంటల్లో 18,08,344 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ