తెలంగాణలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 113 కి చేరిన మరణాలు

Corona News, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India COVID 19 Cases, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana New COVID-19 Cases, Total COVID 19 Cases

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 143 కేసులతో కలిపి జూన్ 5, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2842 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

కొత్తగా రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ ఏరియాలో 116 కేసులు, రంగారెడ్డి‌ జిల్లాలో 8, మహబూబ్ నగర్ లో 5, వరంగల్ లో 3, మేడ్చల్, సంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో రెండు కేసుల చొప్పున, మంచిర్యాలలో ఒక కేసుతో కలిపి మొత్తం 143 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 113 కి చేరినట్టు తెలిపారు.

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 448 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 448 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,290 కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1627 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1550 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =