తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 2,08,922 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. పోలీసు, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు మరియు కేంద్ర పోలీసు దళాల సిబ్బందికి రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6, శనివారం నాడు 33 జిల్లాల్లో 530 సెషన్స్ లో 15,437 మందికి వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
శనివారం నాడు రాష్ట్రంలోని 41,666 ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 37 శాతం (15,437) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ మళ్ళీ ఫిబ్రవరి 8 తేదీ నుంచి కొనసాగుతుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ