చత్తీస్ గడ్ లోని సుకుమా జిల్లా మారాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ లో ఓ జవాన్, తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ముగ్గురిని ముందుగా భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని రాయ్ పూర్ కు తరలించినట్టు తెలుస్తుంది.
ముందుగా సోమవారం తెల్లవారుజామున బేస్ క్యాంప్లో ఉన్న రితేష్ రంజన్ అనే జవాను తన వద్ద ఉన్న ఏకే-47 తో తోటి జవాన్లపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులలో మృతి చెందిన వారిని రాజమణి కుమార్ యాదవ్, రాజీబ్ మోండల్, ధాంజీ, ధర్మేంద్ర కుమార్ గా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన రితేష్ రంజన్ ను అదుపులోకి తీసుకుని, ఈ ఘటన చోటుచేసుకున్న విధానంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కారణాలు సహా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ