టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఎమ్మెల్యేలతో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ భేటీ?

4 TRS MLAs Poaching Incident MLAs Balaraju Rega Kantarao Harshavardhan Reddy Meets CM KCR at Pragati Bhavan, 4 TRS MLAs Poaching Incident, TRS MLA Balaraju, TRS MLA Rega Kantarao, TRS MLA Harshavardhan Reddy, MLA's Meet CM KCR at Pragati Bhavan, Mango News,Mango News Telugu, TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మొయినాబాద్ పామ్ హౌజ్ లో వెలుగులోకి వచ్చిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందుగా బుధవారం రాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలను పార్టీ మారాలని మొయినాబాద్ లోని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి కి చెందిన ఫామ్ హౌజ్ లో సతీష్ శర్మ, సింహయాజి, నందకుమార్‌ అనే ముగ్గురు వ్యక్తులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు తమను ప్రలోభ పెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇవ్వడం, మొయినాబాద్ పామ్ హౌజ్ లో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వీరి అరెస్ట్ అనంతరం ఫామ్‌ హౌజ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది కావడంతో ఆయన కాసేపు అక్కడే ఉండి, 11 గంటల ప్రాంతంలో ఫామ్‌ హౌజ్ నుంచి వెళ్లిపోయారు.

అయితే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి ఫామ్‌ హౌజ్ నుంచి నేరుగా బుధవారం రాత్రి ప్రగతిభవన్​ చేరుకున్నారు. దీంతో ఈ ఘటనపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ ముగ్గురి ఎమ్మెల్యేలతో చర్చించారు. ప్రగతిభవన్​లో ఎమ్మెల్యేలతో జరిగిన చర్చల్లో సీఎం కేసీఆర్‌ తో పాటుగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. ఫామ్‌ హౌజ్ లో జరిగిన వ్యవహారం, కొనుగోలుకు సంప్రదింపులు అంశంపై సీఎం కేసీఆర్ వారిని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. ప్రలోభాలకు లొంగకుండా, పోలీసులకు సమాచారం ఇచ్చి కుట్ర బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు అభినందించినట్టు తెలుస్తుంది. కాగా ఎమ్మెల్యేలు రాత్రికి ప్రగతిభవన్ లోనే ఉన్నారని, గురువారం కేసీఆర్ తో కలిసి లేదా వేరుగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 6 =