తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి, అలాగే రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 67 కు చేరుకుంది. కాగా వీరిలో ఇప్పటికే 22 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 20 మంది శాంపిల్స్ ను ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 30, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,81,587 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,025 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.88 శాతంకాగా, మరణాల రేటు 0.59 శాతంగా నమోదైంది. ఇక గత 24 గంటల్లో 206 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,73,999 కు చేరుకుంది. ప్రస్తుతం 3,563 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. గురువారం నాడు 37,926 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,96,71,933 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 7,97,204 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ