హైదరాబాద్ ప్రజలకు ఎంతో సుపరిచితం అయిన నుమాయిష్ ఎగ్జిబిషన్ నూతన సంవత్సరం రోజున ప్రారంభం కావటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పోయిన సంవత్సరం నిలిపివేయబడిన నుమాయిష్ ఈసారి జనవరి 1న హైదరాబాద్లో ప్రారంభం కానుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం స్టాల్స్ నిర్మాణం చురుకుగా సాగుతోందని తెలంగాణ టుడే పేర్కొంది. ఈ సంవత్సరం 1500 వరకు స్టాల్స్ నిర్మాణం జరుగుతోందని అధికారులు చెప్పారు. ప్రారంభానికి పలువురు ప్రముఖులు రానున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ లోని నాంపల్లి వేదికగా జరుగనున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కోవిడ్-19 ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. మాస్క్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని సూచించింది. అంతే కాకుండా ఎగ్జిబిషన్ జరిగే మొత్తం ప్రాంగణాన్ని ప్రతిరోజూ శానిటైజ్ చేస్తామని సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆదిత్య మార్గమ్ చెప్పారు. కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించడానికి.. ఎగ్జిబిషన్లో అనుమతించబడిన స్టాల్స్ సంఖ్యను తగ్గించినట్లు ఆయన తెలిపారు. మాములుగా ప్రతి సంవత్సరం 2,500 వరకు స్టాల్స్ నిర్మాణం చేయబడుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఈసారి స్టాల్స్ సంఖ్యను తగ్గించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ