2021 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మొత్తం 152 మంది పోలీసు సిబ్బందికి ప్రకటించబడింది. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం కోసం ఈ మెడల్ ను 2018 నుంచి అందిస్తున్నారు. ఈ అవార్డులు అందుకుంటున్న పోలీస్ సిబ్బందిలో అత్యధికంగా సీబీఐ నుంచి 15 మంది, మధ్యప్రదేశ్ నుంచి 11, మహారాష్ట్ర నుంచి 11 మంది పోలీసులు ఉన్నారు. ఇక ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డుకు ఎన్నికయ్యారు. అలాగే ఈ మెడల్ కు ఎంపికైన 152 మందిలో ఇరవై ఎనిమిది మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు.
తెలంగాణ నుంచి పురస్కారాలు దక్కించుకున్న పోలీస్ అధికారులు:
- ఏసీపీ నాయిని భుజంగరావు
- ఏసీపీ ఎన్ శ్యామ్ప్రసాద్రావు
- డీఎస్పీ అలిగాటి మధుసూదన్
- ఏసీపీ జీ శ్యామ్సుందర్
- ఎస్సై నేనావత్ నగేశ్
ఆంధ్రప్రదేశ్ నుంచి పురస్కారాలు దక్కించుకున్న పోలీస్ అధికారులు:
- ఇన్స్పెక్టర్ సామినేని ఆంథోనీ రాజ్
- సీఐ సురేష్ బాబు
- ఎస్డీపీఓ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్
- సీఐ టి మధు
- ఎస్డీపీఓ కె రవి మనోహర చారి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ