తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:30 గం.లకు రాష్ట్రవ్యాప్తంగా అందరూ జాతీయ గీతాన్ని ఆలపించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు. ఇక మరోవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విశాలమైన వేదికపై ఆయనతో పాటు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు కీలక అధికారులు పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
అలాగే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో.. ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఒకవైపు ఒక్క నిమిషం మెట్రో ట్రైన్ సర్వీసులు ఆగిపోగా.. మరోవైపు రోడ్లపై ఎక్కడికక్కడే ప్రయాణికులు జాతీయ గీతం ఆలపించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిమిషం పాటు రెడ్ సిగ్నల్ పడేలా చేసి, ఆ సమయానికి అక్కడ ఉన్న వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వీరికి విద్యార్థుల నుంచి భారీ మద్దతు లభించింది. ఇలా ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావడంతో కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY