తెలంగాణ రాష్ట్రంలో అకాలవర్షం, వడగళ్ల వానతో పలు జిల్లాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్ర పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంటలపై వడగళ్ల వాన ప్రభావంతో నెలకున్న పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈరోజు లేదా రేపు వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రిపోర్టుల పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకొని ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE