తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

71st Republic Day, 71st Republic Day Celebrations, 71st Republic Day Celebrations In Telangana, latest political breaking news, Mango News Telugu, Political Updates 2020, Republic Day 2020, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా త్రివిధ దళాలతో పాటుగా పోలీసు విభాగాలు నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 4 =