దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్క దళితుడికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. అలాగే 2014, 2018 ఎన్నికల సందర్భంగా దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ ఆ లేఖను బండి సంజయ్ జత చేశారు. దళితులకు భూమి కేటాయింపు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తదితర అంశాలను సీఎంకు రాసిన లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు.
(2/2) pic.twitter.com/3Jb5u7vKTM
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 27, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ