మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌

Aler Ex-MLA Bikshamaiah Goud Joins in TRS in the Presence of TRS Working President KTR, Ex-MLA Bikshamaiah Goud Joins in TRS, Ex-MLA Bikshamaiah Goud Joins Presence of KTR, Aler Ex-MLA Bikshamaiah Goud, Bikshamaiah Goud Resigns to BJP, Bikshamaiah Goud Resignation Letter, Bikshamaiah Goud Resigned To BJP, Mango News, Mango News Telugu, Telangana Alair ex-MLA Bikshamaiah Goud, Alair ex-MLA Bikshamaiah Goud, Ex-Telangana MLA B Bikshamaiah Goud, Bikshamaiah Goud Quits BJP, Telangana BJP, BJP Party Latest News And Updates, Telangana News And Live Updates

ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్ లో చేరగా, ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి సహా పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 2018 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న భిక్షమయ్య గౌడ్‌ గత ఏప్రిల్ లోనే బీజేపీ చేరారు. కాగా బీజేపీలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని, అలాగే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బీజేపీకి రాజీనామా చేస్తూ గురువారం లేఖ విడుదల చేశారు. ఈ క్రమంలోనే తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసిందని, అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడులో ధనబలంతో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =