మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో జనవరి 19, ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీడీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తుండడంతో, టీడీపీ పార్టీ విధానాన్ని తెలియజేస్తూ అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలపై టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని భావిస్తున్న సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు ఇతర బిల్లులపై చర్చించనున్నారు. అలాగే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 33 రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శాసనసభాపక్షం భేటీ అనంతరం మధ్యాహ్నం నుంచి టీడీపీ పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు మరో సమావేశం నిర్వహించనున్నారు.
[subscribe]
Chandrababu Naidu Strong Warning To CM YS Jagan Over Amaravati Capital Issue | AP Political News
05:51
Jr. NTR & Kalyan Ram Pays Homage To Sr NTR | Telugu Latest News | Mango News
03:26
Chandrababu Naidu Slams YCP Govt Over Security For Amaravati JAC Bus Trip | AP Political News
04:43
MP Galla Jayadev Suggested To Remove 144 Section In Amaravati In Press Meet | AP News | Mango News
05:15