తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందుగా మే 15వ తేదీవరకు దరఖాస్తు గడువును పొడిగించగా, ఈసారి మే 31 వరకు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, ఈసెట్, పీజీ ఈసెట్, పీ ఈసెట్, పీజీ ఎల్సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు దరఖాస్తు గడువు పెంచడంతో మరో అవకాశం లభించింది. ఇక అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహణ వాయిదా పడిందని, పరీక్షల నిర్వహణ కోసం కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు గతంలోనే ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu