కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం లడ్డూను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలుసుకుని లడ్డూను అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో సభ్యులు లడ్డూను అందజేశారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ లడ్డూ వేలంపాటకు ఎంతో ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లో లడ్డూ వేలంపాటను 1994 సంవత్సరంలో మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం వేలంపాటలో లడ్డూ ధర పెరుగుతూనే ఉంది. 2019లో బాలాపూర్ లడ్డూ ధర రూ.17.60 లక్షలు పలికింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu