తెలంగాణలో సెప్టెంబర్ 2 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,00,013 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2611 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.5 శాతంగా నమోదైంది. మరోవైపు బుధవారం నాడు కొత్తగా నమోదైన 2817 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,406 కు చేరగా, మరణాల సంఖ్య 856 కి పెరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 32,537 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2817):
- జీహెచ్ఎంసీ – 452
- రంగారెడ్డి – 216
- కరీంనగర్ – 164
- ఖమ్మం – 157
- నల్గొండ – 157
- మేడ్చల్ – 129
- సిద్దిపేట – 120
- సూర్యాపేట – 116
- వరంగల్ అర్బన్ – 114
- నిజామాబాద్ – 97
- భద్రాద్రి కొత్తగూడెం – 89
- జగిత్యాల – 88
- సంగారెడ్డి – 76
- పెద్దపల్లి – 75
- యాదాద్రి భువనగిరి – 73
- మంచిర్యాల – 71
- మహబూబాబాద్ – 62
- కామారెడ్డి – 62
- రాజన్నసిరిసిల్ల – 53
- వరంగల్ రూరల్ – 46
- వనపర్తి – 45
- మహబూబ్నగర్ – 42
- జనగామ – 41
- నాగర్కర్నూల్ – 41
- ఆదిలాబాద్ – 36
- మెదక్ – 35
- జోగులాంబ గద్వాల్ – 33
- వికారాబాద్ – 27
- జయశంకర్ భూపాలపల్లి – 26
- నారాయణ్ పేట్ – 21
- ఆసిఫాబాద్ – 19
- ములుగు -18
- నిర్మల్ – 16
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu