కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రో రైలు సంస్థలు, ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలును కేంద్రప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది.
మెట్రో రైలు ప్రయాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలు:
- కంటైన్మెంట్ జోన్ల వద్ద ఉన్న మెట్రో స్టేషన్లను మూసి వేయాలి.
- ప్రయాణీకులు, సిబ్బంది సహా అందరూ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.
- సామాజిక దూరాన్ని పాటించేలా స్టేషన్లలో మరియు రైళ్ల లోపల తగిన గుర్తులు ఏర్పాటు చేయాలి.
- స్టేషన్లలో మరియు రైళ్లలో ప్రయాణీకుల రద్దీని నివారించడానికి రైళ్ల నడిపే సమయాలను క్రమబద్దీకరించాలి.
- స్టేషన్లలోకి ప్రవేశించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే ప్రయాణించడానికి అనుమతించాలి.
- ప్రయాణీకుల కోసం స్టేషన్లలోకి ప్రవేశించేటప్పుడు అన్ని చోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
- ప్రయాణికులు అందరూ ఆరోగ్య సేతు యాప్ వాడేలా ప్రోత్సహించాలి.
- ప్రయాణికులు తక్కువ లగేజీతో రావాలని సూచన.
- స్మార్ట్ కార్డ్ మరియు నగదు రహిత/ఆన్లైన్ లావాదేవీల వాడకాన్ని ప్రోత్సహించాలి. టోకెన్లు, పేపర్ స్లిప్స్/టికెట్ లను సరైన విధంగా శానిటైజేషన్ చేశాకనే వాడాలి.
- ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించేలా, రద్దీతో కాకుండా సాధారణంగా రైళ్లలోకి వెళ్లేలా స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేయాలి.
- రైళ్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో స్వచ్ఛమైన గాలి ఉండేలా సాధ్యమైనంతగా చర్యలు తీసుకోవాలి.
- మెట్రో రైలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్థానిక పోలీస్ సహా అధికారిక సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి.
- మెట్రో ప్రయాణికుల అవగాహన కోసం స్టేషన్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu