కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర నేడు (నవంబర్ 1, మంగళవారం) హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పాదయాత్ర కొనసాగించి నెక్లెస్ రోడ్లోని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మధ్య డైరక్ట్ లైన్ ఉందని, ఆ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి డ్రామా చేస్తారని, ఎప్పుడేం చేయాలో కూడా ప్రధాని మోదీ సీఎం కేసీఆర్కు సూచిస్తారని అన్నారు. పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు టీఆర్ఎస్ మద్దతిస్తోందని, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు మాత్రం మద్దతీయడం లేదని తెలిపారు. పోర్టులు, ఎయిర్పోర్టులను, ఎల్ఐసీని కేంద్రం అమ్మేస్తోందని, ఈ క్రమంలో అతి త్వరలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీకి స్నేహితులైన వ్యాపారవేత్తలు స్వాధీనం చేసుకుంటారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల యజమానులు లక్షలు, కోట్ల రూపాయలు రుణం తీసుకోగలుగుతారని, చిరు వ్యాపారులు మాత్రం చిన్న రుణాలు కూడా పొందలేకపోతున్నారని రాహుల్ మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY