రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో సమన్వయం, సహకారంతో దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. కరోనా నివారణపై ఎప్పటికప్పుడు కీలక మార్గదర్శకాలను కేంద్రం జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న కూడా కొన్ని ఇబ్బందులు ఉండడంతో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ కోవిడ్ ఫాలో అప్ మార్గదర్శకాలను ఆదివారం నాడు ప్రకటించారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరు అలసట, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సహా అనేక సంకేతాలను, లక్షణాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దీంతో కోలుకుంటున్న బాధితులంతా పోస్ట్ కోవిడ్ కేర్ ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. దీనిపై దృష్టి పెడుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ను జారీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న బాధితులు పాటించాల్సిన సమగ్ర విధానాన్ని తెలియజేశారు. అయితే ఇవి కేవలం ఫాలో అప్ ప్రొటోకాల్స్ మాత్రమేనని, చికిత్స లేదా నివారణకు కాని ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు.
వ్యక్తిగత స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కరోనా పట్ల అవసరమైన జాగ్రత్తలు యథావిధిగా కొనసాగించాలి. మాస్క్ వేసుకోవడం, చేతులు పరిశుభ్రత, శ్వాసకోశ విధానం, భౌతిక దూరం పాటించడం చేయాలి.
- తగినంత వెచ్చని నీటిని త్రాగాలి.
- ఆయుష్ అర్హత కలిగిన ప్రాక్టీషనర్ సూచనల మేరకు, ఆయుష్ ప్రోత్సహించే రోగనిరోధక శక్తి ఔషధాన్ని తీసుకోవాలి.
- ఆరోగ్యం అనుమతిస్తే క్రమం తప్పకుండా ఇంటి పని చేయాలి. వృత్తిపరమైన పనులను దశల వారీగా తిరిగి ప్రారంభించాలి.
- తేలికపాటి/మితమైన వ్యాయామం చేయాలి.
- ఆరోగ్యం పరిమితుల మేరకు యోగాసన, ప్రాణాయామం, ధ్యానం రోజువారీ అభ్యాసం చేయాలి.
- వైద్యుడికి సూచనల మేరకు శ్వాస వ్యాయామాలు చేయాలి.
- ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సౌకర్యవంతమైన వేగంతో నడవాలి.
- సమతుల పోషకాహారం, తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. దీనిని జీర్ణం చేసుకోవడం సులభం.
- తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి.
- ధూమపానం, మద్యపానం మానుకోవాలి.
- కరోనా కోసం సూచించిన ఔషధాలతో పాటు ఇతర వ్యాధులు ఏమైనా ఉంటే క్రమం తప్పకుండా ఆ ఔషధాలనూ తీసుకోవాలి.
- ప్రిస్క్రిప్షన్ విషయంలో అనుమానాలను రేకెత్తించే పరిస్థితులను నివారించడానికి వ్యక్తి తీసుకునే అన్ని ఔషధాల గురించి (అల్లోపతి / ఆయుష్) డాక్టర్ కు ఎల్లప్పుడూ తెలియజేయాలి.
- ఇంట్లో స్వీయ ఆరోగ్య పర్యవేక్షణ: ఉష్ణోగ్రత, రక్తపోటు, రక్తంలో చక్కెర (ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే), పల్స్ ఆక్సిమెట్రీ మొదలైన(వైద్యపరంగా సలహా ఇస్తే) పరీక్షలు ఎప్పటికప్పుడు చేసుకోవాలి.
- నిరంతరం పొడి దగ్గు/గొంతు నొప్పి ఉంటే, సెలైన్ గార్గల్స్ చేసి ఆవిరి పట్టాలి. గార్గ్లింగ్/ఆవిరి పీల్చడం కోసం మూలికలు/సుగంధ ద్రవ్యాలు అదనంగా వేసుకోవాలి.
- దగ్గు మందులు, మెడికల్ డాక్టర్ లేదా ఆయుష్ అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి.
- హై గ్రేడ్ జ్వరం, శ్వాస తీసుకోకపోవడం, ఆక్సిజన్ స్థాయులు <95%, చెప్పుకోలేని స్థితిలో ఛాతీ నొప్పి, గందరగోళం, ఫోకల్ బలహీనత వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గమనిస్తూ ఉండాలి.
కమ్యూనిటీ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వ్యక్తులు తమ సానుకూల అనుభవాలను వారి స్నేహితులు, బంధువులతో సోషల్ మీడియాలో, కమ్యూనిటీ నాయకులతో పంచుకోవాలి.
- స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ సంస్థల మద్దతు తీసుకోండి. రికవరీ, పునరావాసానికి (వైద్య, సామాజిక, వృత్తి, జీవనోపాధి) కోసం అర్హత కలిగిన నిపుణుల సహాయం తీసుకోండి.
- తోటివారిని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, కౌన్సిలర్ నుండి మానసిక, సామాజిక మద్దతును పొందండి. అవసరమైతే మానసిక ఆరోగ్య సహాయ సేవను కోరండి.
- భౌతిక దూరం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యోగా, ధ్యానం మొదలైన గ్రూప్ సెషన్స్ లో పాల్గొనండి.
ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్నిఎప్పుడూ సంప్రదించాలంటే:
- కరోనా నుంచి కోలుకున్నాక మొదటి ఫాలో అప్ విజిట్ (నేరుగా వెళ్లి కానీ, టెలిఫోన్ ద్వారా కానీ) డిశ్చార్జ్ అయిన 7 రోజులలోపు ఉండాలి. అది చికిత్స పొందిన ఆసుపత్రి అయి ఉండాలి.
- ఆ తర్వాత నుండి, తదుపరి చికిత్స/తదుపరి సందర్శనలు సమీప అర్హత కలిగిన అల్లోపతి/ఆయుష్ ప్రాక్టీషనర్ లేదా ఇతర వైద్య చికిత్స విధానం దగ్గరకు వెళ్ళవచ్చు. తెలియని ఔషధ వినియోగానికి సంభావ్యత ఉన్న కారణంగా పాలీ-థెరపీని నివారించాలి. ఇది తీవ్రమైన ప్రతికూల ఘటనకు కానీ, ప్రతికూల ప్రభావాలకు కానీ దారితీయవచ్చు.
- ఇంట్లో ఐసొలేషన్ లో ఉన్న బాధితులు, లక్షణాలు ఇంకా అలాగే ఉంటే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి.
- తీవ్రత ఎక్కువగా ఉన్న కేసు విషయంలో క్రిటికల్ కేర్ అవసరం. అందుకోసం కఠినమైన ఫాలో అప్ ఉండాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu