వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదంటూ, నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారు. పాదయాత్రకి అనుమతి ఇవ్వక పోవడంతో అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం ఇచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ షర్మిల దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు అడ్డుకోగా వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను అక్కడి నుంచి పోలీసు వాహనంలో లోటస్ పాండ్ లోని ఆమె నివాసానికి తరలించారు. కాగా లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం వద్ద కూడా వైఎస్ షర్మిల తన ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE