బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్టు కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తునట్టు సికింద్రాబాద్ కోర్టు పేర్కొంది. బెయిల్ పిటిషన్ ను తిప్పి పంపుతూ, సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో బెయిల్కోసం అఖిలప్రియ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు విచారణ నిమిత్తం ఇటీవలే అఖిలప్రియను 3 రోజుల పాటుగా పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంగా ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలను రాబట్టినట్టు సమాచారం. ఆధారాలను బట్టి ఈ కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అఖిలప్రియ ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ