తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి రవి కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో(మార్చి 30, మంగళవారం) ముగియనుంది. ఏప్రిల్ 17 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
List of BJP candidate for bye-election to the legislative assembly election of Telangana state finalised by BJP CEC. pic.twitter.com/1SA7CP5MAv
— BJP (@BJP4India) March 30, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ