భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. నేను బాగానే ఉన్నాను మరియు అధికారులు, వైద్యులు సూచించిన అన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను. అలాగే గత 7 రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్ధిస్తున్నాను” అని హర్మన్ప్రీత్ కౌర్ ట్వీట్ చేశారు.
ఇటీవలే లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన 5 వన్డే మ్యాచ్ల సిరీస్ లో హర్మన్ప్రీత్ కౌర్ పాల్గొన్నారు. ఆ సమయంలో క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ తర్వాతనే హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా సోకినట్టు భావిస్తున్నారు. ఇక మార్చి 17న జరిగిన చివరి వన్డేలో ఆమె గాయపడడంతో టీ20ల్లో ఆడడం లేదు. మరోవైపు ఇటీవల రాయ్పూర్లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 టోర్నమెంట్లో పాల్గొన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్, ఇర్పాన్ పఠాన్, బద్రీనాథ్ కూడా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.
— Harmanpreet Kaur (@ImHarmanpreet) March 30, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ