గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ బీజేపీ షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అన్ని వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్ను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజాసింగ్ యూట్యూబ్లో విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, 10 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పార్టీ నుంచి ఆయనను ఎందుకు బహిష్కరించకూడదో సహేతుక వివరణ ఇవ్వాలని, సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని సూచించింది కేంద్ర కమిటీ. కాగా ఒక వర్గాన్ని ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయన విడుదల చేసిన వీడియోపై రాత్రంతా మైనారిటీలు ఆందోళనలు నిర్వహించగా పోలీసులు జోక్యం చేసుకుని యూట్యూబ్ నుంచి ఆ వీడియోను తొలగించారు. మరోవైపు రాజాసింగ్పై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY